Tuesday, April 28, 2020

కరోనా: బ్రాహ్మణాచారమూ, యోగ వాశిష్ఠ్యమూ, యాగమూ, బీజక్షరాలూ

కరోనావల్ల సమాజంలో జోకరుగాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎన్నికలప్పుడు  కిలారి ఆనందపాలుడు మాత్రమే... ఇప్పుడు ఎవుడుబడితేవాడు కామెడీ జేస్తున్నాడు.అసలు కరోనా రాకతోనే కామెడీ మొదలయ్యింది. కొందరు బడుధ్ధాయిలు ఉత్తరప్రదేశ్‌లో అనుకుంటాను గోమూత్రపార్టీ చేసుకుని కరోనానుంచి ముందస్తు విముక్తి పొందారట. అందులో కొందరి మాటలు వింటుంటే ఈ గాడిదలు చదువుకొని ఎమినేర్చుకున్నారా అనిపిస్తుంది. వాళ్లలో ఒకడి ప్రకారం గోమూత్రంలో వైరస్ బ్రతకలేదట. వాడుదాన్ని వాట్సాప్ యూనివర్సిటీలో తెలుసుకొనుంటాడు. ఇహ సెలబ్రిటీలుకూడా భారతీయ ఆచారాల గొప్పతనాన్ని ఏకరువు పెట్టడం మొదలుపెట్టారు. సంస్కారము, నమస్కారము, ఆచారము, ప్రక్షాళనము అంటూ. బాబులూ ఇంతకన్న గొప్ప ఆచారాలు జపనీయులకున్నై. అయినా పురాతన భారతీయులకు సబ్బుముక్కలూ, శానిటైజర్లూ, క్లోరోక్వినులూ తెలుసేం? 

భారతీయ ఆచారాలకు బ్రాహ్మణతను జోడించి తన వెధవతనాన్ని ముందుగా బయటపెట్టుకున్న ఖ్యాతి ప్రముఖ బూతుపాట రచయిత జొన్నవిత్తుల గారు. ఆయన ప్రకారము కులాలనుబట్టి పాటించే అంటరానితనమనబడు సామాజిక దూరం అంటువ్యాధులు ప్రబలకుండా చూడడానికి ఉద్దేశించినదట! అవునుమరి అంటువ్యాధులు కేవలం పంచములనుండి (వాళ్ళెలాగూ జంతువులకన్నా హీనులుకదా) ఇతరులకు వ్యాపిస్తుంది. బ్రాహ్మణుల్లో ఒకరికి అంటువ్యాధివున్నా అది స్పర్శద్వారా ఇంకొక బ్రాహ్మణుడికి సోకే అవకాశమే లేదు మరి. మరి బాబుగారు హైందవదురాచారాలనూ, అనాగరిక పధ్ధతులనూ, పురాణాల్లో కనిపించే వావివరసలు విడిచి సాగించిన శృంగారాన్నీ, స్త్రీలను కాల్చుకు తినడాన్నీ కూడా సమర్ధిస్తారేమో చూడాలి. ఇలాంటి పొగరుబోతులు నోటికొచ్చింది వాగడమూ, దాన్ని టీవీలు సిగ్గులేకుండా చూపించడమూ. ఇండియాకాబట్టి సరిపోయిందిగానీ ఇవే వెర్రికూతలు ఒక మోస్తరు దేశంలో చేసుంటే బాబుగారిని ప్రభుత్వంవారు బొక్కలోతోసి నాలుగు తగిలుంచుండేవారు. ఈ పోరంబోకులు జనాలకి మంచిని బోధిస్తారు. బీజాక్షరాలు అంటూ సొల్లువాగుడు వాగినందుకే ఈయన్ని జైల్లోపెట్టి గోళ్ళూడకొట్టొచ్చని నా అభిప్రాయం. అస్టక్షరీమంత్రాన్ని ఆలయగోపురమెక్కి అందరికీ పంచిన రామానుజాచార్యులకంటే ఎక్కువగా తెలుసేం గరికపాటికి? అంతకంటే ఉధ్దండుడా ఈ ప్రబుధ్దుడు? ఈ ప్రచనకారులంతా పచ్చి పనికిమాలిన బాపతుకాక మరింకేమిటి? ఇలాంటోళ్ళని వదిలించికొంటేగానీ ఏసమాజమూ, దేశమూ బాగుపడదు.

గరికపాటిగారిది ఇంకోగోల. చాగంటి కోటేశ్వరరావులాంటి కులపిచ్చితో కూడిన మనువాదపు కూతలు కుయ్యడంలేదుకాబట్టి ఈయన కొంచెం మెరుగనుకున్నాను. ఈయనా అంతే! ఈయనంటాడూ... "చెడుతిండివల్లా, చెడ్డఆలోచనలవల్లా" రోగమొకటొస్తుందని చెప్పబడింది అని. చెడుతిండి అంటే వివిధరకాల మాంసాలు తినడం అట. చెడు ఆలోచనలు అంటే జీవాయుధాలూ, యుధ్ధాలూ ఇంకా ఏవేవో అట. అసలు శ్లోకంలో అలాంటివేమీ లేకున్నా ఈయన తాలింపులువేసి దాన్ని ప్రస్తుత పరిస్థితికి అన్వయించేశారు. అంతటితో ఆగలేదు మహానుభావుడు దానికి విరుగుడునుకూడా సూచించాడు. వివిధ రకాల ధాన్యాలనుంచి కరోనాకు మందుకనిపెట్టొచ్చని అక్కడెక్కడో రాసుందట. ఆవిధంగా పరిశోధనలు కొనసాగించమని ఒక బోడిసలహా పడేశాడు. అసలు సంబంధమేలేనిదాని గురించి ఎవరైనా ఎందుకు పరిశోధించి సమయం, ధనం వృధా చేసుకోవాలి? ఒకరికి కామెర్ల వ్యాధి ఉందనుకుందాం. ఏదో ఒక పురాతన పుస్తకంలో కామెర్లు నయంకావడానికి రోగిచేత గులకరాళ్ళు మింగించవలెను అని రాసుందనుకుందాం. మతున్నోడెవడైనా కామెర్లు ఎందుకొస్తాయో తెలుసుకొని, అది నయంకావడానికి గులకరాళ్ళు మింగడం ఎలా సాయపడుతుంది అని తర్కిస్తాడు. అంతేగానీ వెంటనే పరిశోధనలు మొదలెట్టడు. how many nonsensical things do we have to research about? వాడెవడో రాజస్థాన్‌లో గుడ్లగూబలని ముట్టుకొన్న చేత్తో, కరోనా రోగిని స్పృశించడంద్వారా కరోనాను నయం చెయ్యొచ్చు అని చెప్పాడు. ఇప్పుడు డాక్టర్లు లేదా సైంటిస్టులు గోమూత్రమ్మీద, గుడ్లగూబలమీదా, బీజాక్షరాలామ్మీదా, ధాన్యాలమీదా, తావీజులమీదా, ప్రార్ధనలమీదా, గరికపాటిలాంటి అజ్ఙానులు వాగే వాగుళ్ళమీదా పరిశోధిస్తే ఇక మందును కనుక్కున్నట్లే! వీళ్లకేమీ బాధ్యత ఉండదుకాబట్టి ఒక్కో అజ్ఙానీ ఒక్కో క్యూర్ ఇచ్చేస్తాడు. వీళ్ళ మాటలు పట్టుకు పరిశొధనలు చేస్తే కుక్కతోకపట్టుకొని గోదారి ఈదినట్లే! బీజాక్షరాలు అంటూ సొల్లువాగుడు వాగినందుకే ఈయన్ని జైల్లోపెట్టి గోళ్ళూడకొట్టొచ్చని నా అభిప్రాయం. అస్టక్షరీమంత్రాన్ని ఆలయగోపురమెక్కి అందరికీ పంచిన రామానుజాచార్యులకంటే ఎక్కువగా తెలుసేం గరికపాటికి? అంతకంటే ఉధ్దండుడా ఈ ప్రబుధ్దుడు? ఈ ప్రచనకారులంతా పచ్చి పనికిమాలిన బాపతుకాక మరింకేమిటి? ఇలాంటోళ్ళని వదిలించికొంటేగానీ ఏసమాజమూ, దేశమూ బాగుపడదు. అయ్యా సామీ! నీ పనికిమాలిన బీజాక్షరాలు మడిచి జేబులోపెట్టుకో. అవేవీ లేకుండానే కొన్నిదేశాలు కరోనాను జయించాయి. ఇప్పుడదే ఇక్కడా జరుగుతుంది. అదయినప్పుడు ఆ ఘనతంతా నీదేనని చెప్పుకొనేందుకు మళ్ళీ టీవీలముందుకురా. అప్పటిదాకా మూసుక్కూచో నోరు.

ఈమధ్య ఇంకో కొత్త పిచ్చోణ్ణి చూస్తున్నాం. వాడెవడో చాగంటి అట. అమెరికాలో ఒక యాగం చేసి కరోనాను ఏదో పట్టణానికో, ప్రావిన్సుకో ఆమడదూరంలో నిలిపాడట. ఋజువట వాడి శ్రాధ్దం అట. గతంలో ఈయన ఏదో తుఫాన్నుకూడా యాగంద్వారా ఆపేశాడట. తుపాకీ తలకి గురిపెట్టి కాల్చి గుండును యాగంద్వారా ఆపమంటే సరిపోయేది. ఇలాంటోళ్ళని ఎందుకు రోడ్లపై తిరగనిస్తారో ఏమో! పిచ్చికుక్కల్ని వ్యానుల్లో తోసుకెళ్ళినట్లు వీళ్లనీ తీసుకెళ్ళాలి ఇప్పుడెముంది వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పుడు ఇలాంటి పాఖండులు మరికొందరొస్తారు "మేము చేసిన యాగంవల్లే వైరస్ ఉధృతి  తగ్గింది" అంటూ. ఎలాగూ మన డిగ్రీలు మనకు ఉద్యోగాలనిస్తాయేగానీ, తెలివితేటలు పెంచవు కాబట్టి మనమూ డాక్టర్లనీ, ప్రభుత్వాలు చేపట్టిన విధానాలనీ, పోలీసులనీ మర్చిపోయి, దేవుడే మనల్ను రక్షించాడు అంటూ గుళ్ళకి బారులు తీరతాం. అన్నట్లు ఫెయిత్ హీలర్లు ఇప్పుడు కరోనావార్డుల్లోకి వెళ్ళి యేసుకృపతో కరోనారోగులను మందలు మందలుగా ఆరోగ్యవంతులనుగావించవచ్చునే! ఎక్కడబడేడుస్తున్నారీ ఈ ఆపత్కాలంలో?