Saturday, September 26, 2020

newslaundry.com


నిజమైన రిపోర్టింగ్ వీళ్ళు చేస్తున్నారు. దాంతోపాటు B & D మీడియాను బజారులోకి లాగుతుందీ వీళ్ళే. ఈ మధ్య వీళ్ళ సైటులో కాస్త బుర్రవున్న వ్యాసాలు, వీళ్ళ podcastల్లో పనికొచ్చే చర్చలు చూస్తున్నాను. ఆ మధ్య వీళ్ళే వాడెవడో దూబే అరెస్టైతే వీళ్ళు "వీడుకూడా ఎంకౌంటర్‌లో ఛస్తాడు చూడండి" అని చెప్పేశారు. దానికిగాను అర్ణభుడు "death predictions కూడా ఇచ్చేస్తున్నారా ఈ launderers of news?" అంటూ నిప్పులుతొక్కిన కోతిలా గంతులేశాడు స్టూడియోలో. తీరా తెల్లారాక దూబేయుడు నిజంగానే ఎంకౌంటర్లో చచ్చాడు. మూసుక్కూచోవడం అర్ణభుడి పనైంది. ఈ మోదియా (మోదీ మీడియాకు మరోపేరు. ఇంకో హిందీపదం గుర్తొస్తే అది ఎవరి తప్పూకాదు.) ఈ మధ్య మోదీని వెనకేసుకు రావడానికి ఎవర్ని పడితే వాళ్ళను బదనాం చేస్తోంది. మొదట JNU విద్యార్ధులు,  తరువాత మేధావులు, రైతులు, సినిమావాళ్ళు ఇలా... మొన్నామధ్య ఒళ్ళు బలిసిన ఒక ఛానెల్ చైనావాడు ఇండియా సరిహద్దుల్లోకి చొచ్చుకు వస్తే అదంతా సైన్యం వెధవాయితనం... దానికి ప్రభుత్వాన్ని తప్పుబట్టాల్సిందీ, ప్రభుత్వం జవాబు చెప్పాల్సింది ఏమీలేదనేదాకా వెళ్ళింది వ్యవహారం. 

నేను టీవీలు, అందులోవచ్చే వార్తలు చూడను. ఏముంది గనుక చూడ్డానికి. భడవా మీడియాలో అంతా మతంపేరిట జనాలను విభజించే కుట్రలు, బీజేపీ చంకలు నాకడం. తెలుగు మీడీయాలో కులాల కుంపట్లు మరియు కులాలవారిగ చంద్రబాబుదో, జగనుదో నాకడం. స్వాభిమానం ఉన్నవాళ్ళెవ్వరూ తెలుగుపేపర్లు చదవరు అని నా ఒకానొక మిత్రురాలి అభిప్రాయం. కానీ పవిత్ర భారద్దేశానికి పట్టిన గతే భారద్దేశ మీడియాకూ పట్టిందని చెప్పే ఈ TV Newsance మాత్రం తప్పకుండా చూస్తాను. వీళ్ళుచేసే వెటకారాలు, మీదియా బట్టలిప్పి నుంచోబెట్టడం నాకు నచ్చుతాయి. పనిలోపనిగా అసలు విషయాలు, విస్మరించబడుతున్న విషయాలు "ఇవీ" అని under currentగా చెబుతూనే ఉంటారు. అందుకే ప్రస్తుతానికి ఒక ఆరునెలల చందా కట్టేశాను. 


అన్నట్లు... ఈ డిజిటల్ మీడియాను చూసే... మోదీ సర్కారు కింద మేకుదిగినట్లు ఉలిక్కి పడుతోంది. రేప్పొద్దున డిజిటల్ మీడియాకూ కళ్ళెమేసి ఇండియాను పాకిస్తాను కాకపోయినా ఒక చైనానో, ఉత్తరకొరియానో చేస్తారని నాకు డౌటనుమానం. 

Tuesday, September 15, 2020

Open Letter to Indian Media

 https://medium.com/@feministvoicesnow/dear-news-media-of-india-bdc7f74a571a


ఇలాంటి లేఖలవల్ల ప్రయోజనముంటుందని నేననుకోను. ఇలాంటి టీవీలు కార్యక్రమాలు చూసే లేకిబుధ్ధిని భారతీయులే వదిలించుకోవాలి. ఇతరుల జీవితాల్లోకి తడికల కన్నాల నుండి చూడాలనే perverted బుధ్ధి భారతీయులే వదిలించుకోవాలి. అది సాధ్యంకానంతవరకూ ప్రేక్షకులకోసం ఏహద్దులు దాటడానికైనా భారతీయ మీడియా సిధ్ధమే! అయినా ప్రభుత్వపు ప్రాపుకోసం ఆత్మలనమ్ముకుంటున్న న్యూస్ రీడర్లనీ, మీదియా అధిపతులనీ చూస్తున్నాం. అసలు సమస్యలమీద చర్చను వారించడానికి అసలు అవసరమేలేని విషయమ్మీద చర్చించడం, దాన్ని ప్రేక్షకులు గుడ్లప్పగించి చూసి తమ "కుతి" తీర్చుకోవడం భారతదేశానికే చెల్లింది. 


ఆ అమ్మాయి తప్పు చేసుండవచ్చు. ఆ అమ్మాయే సుశాంత్ మరణానికి కారణమయ్యుండొచ్చు. కానీ ఆ విషయం విచారించడానికి రెండు దర్యాప్తుసంస్థలు కృషిచేస్తున్నాయ్. ఈలోగా మీడియా ఆ అమ్మాయిని harass చెయ్యడమెందుకు? ఆ అమ్మాయికి బలగం లేదనేగా? సల్మాన్‌ఖాన్‌తోటీ, సంజయ్‌దత్‌తోటీ ఇలా దూకుడుగా వ్యవరించగలదా ఈ మీడియా? మరి రాజకీయనాయకులతోటీ? ఆ అమ్మాయి కారులో వెళుతుంటే వెంటాడారు. ఆ అమ్మాయిని పోలీసు కారులో ఉంటే ఎవడో ఒక విలేకరి రాక్షసుడు "రియా! నువ్వు MDMA తీసుకున్నావా? డ్రగ్స్ తీసుకున్నావా? చెప్పు రియా... మేమడుగుతున్నాంగా!" అంటూ రౌడియిజం. కొంచెం కూడా sense of morality ఉండదాండీ? ఆఖరుకు ఆ అమ్మాయి కుటుంబం ఏదో food order ఇస్తే... ఇంటికొచ్చిన delivery boyని కాల్చుకుతిన్నారు. Delivery boyని ఇంటర్వ్యూ చేయడానికి ఏముంటుంది? హాద్దులుమీరిన శాడిజం కాకుంటే?


మన మీడియా భాజపా చంకలు నాకుతోంది. భాజపాకు ఇబ్బంది కలిగించే అంశాలమీద చర్చలు జరపడం దానికి ఇష్టంలేదు. అందుకే... చైనా గురించో, GDP గురించో, unemployment గురించో, కరోనా విలయతాండవాన్ని ఆపడానికి ప్రభుత్వం చేపడుతున్న పనులగురించో భారతీయ మీడియా చర్చించదు. అలా చర్చిస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకురావు. అందుకే వాళ్ళు రామమందిరం, హిందూ-ముస్లిం విభేదాల గురించి రోజుల తరబడి చర్చిస్తారు. మధ్యలో ఎవరైనా అశక్తులు, బలహీనులు దొరికితే కర్కశంగా వాళ్ళను రోడ్డుకీడ్చి, వాళ్ళ బ్రతుకులు బజారుపాలు చేస్తారు. అందునా కొన్ని మీడియా సంస్థలు ఎలా తయారయ్యాయంటే... స్టూడియోలో కెమేరాలముందు అశుధ్ధం తింటే TRPలు వచ్చేటట్లైతే, వాళ్ళు ఆపనీ చేసేస్తారు. 

Saturday, September 12, 2020

సుశాంత్ - రియా - అర్ణబ్ - కంగన యవారము మరియు భారత ప్రజల చవలాయి తనం

ఆమధ్య జస్టిస్ మార్కండేయ ఖట్జూ "భారతీయుల్లో తొంభైశాతమ్మంది బుర్రతక్కువ వెధవలు, చవటలు, చవలాయిగాళ్ళు" అనంటే చాలామందికి పొడుచుకొచ్చిందిగానీ ఆయనన్నది నూరుశాతం నిజం. 

సుశాంత్ చనిపోగానే, కారణం డిప్రెషనన్నారు. ఇక్కడ యవారంలోకి అక్కాయ్ కంగన దూరేసింది. డిప్రెషన్‌కి కారణం నెపోటిజమన్నారు. తరువాత ఆ కారణం స్నేహితులన్నారు. ఆ తరువత బాలీవుడ్ మాఫియా. తరువాత ఆత్మలు, దయ్యాలూ వాటిమొగుళ్ళూ అని జనాల్ని యెదవల్ని జేశారు. ఆ తరువాత రియా అన్నారు. ఇప్పుడు డ్రగ్సంటన్నారు. ఇప్పుడంతా కంగనక్కాయ్‌కీ శివసేనకీ గొడవ నడుస్తోంది. మధ్యలో సుశాంత్ మరణం ఏమయిపోయిందో ఎవుడికీ గుర్తులేదు. ఇదంతట్నీ దగ్గరుండి నడిపించింది వార్తల వేశ్య అర్ణబ్. వాడిక్కావలసింది TRP. దానికోసం అవసరమైతే భారతమాత అనేదొకటుంటే, దానికి గుడ్డలిప్పదీసి స్టూడియోలో కూచోబెట్టి, దానిచుట్టూ చేరి అరుస్తాడు. భారతీయులందరరూ రెప్పవాల్చకుండా దాన్ని చూసి వాడి TRPలు పెంచుతారు. ప్రపంచంలో పనికిమాలిన జాతి, సిగ్గులేని జాతి ఏదైనా ఉందంటే అది భారతజాతి. 

ఈమధ్యలో ఎకానమీ గురించి, పోతున్న ఉద్యోగాల గురించీ మనం పట్టించుకోం. కరోనా మొదలయినప్పట్నుంచి, ఇప్పటి వరకూ దేశంలో కొత్తగా ఎన్ని హాస్పిటల్స్ కట్టారు? ఎవ్వడికీ ఇది పట్టదు. రోజుకి లక్షకేసులొస్తున్నాయ్ (అందులో చాలా కేసులు అసలు రిపోర్టే అవడంలేదు). వాళ్ళందరకీ ఎలా చికిత్స చేస్తున్నారు? అసలు చేస్తున్నారా? మనకనవసరం. ప్రధాని గారేమో చనిపోతున్నవారిశాతం అమెరికాతో పోల్చితే చాలా తక్కువ అంటారు. అదేమిటి? అంటే ఒక నలభైశాతం చస్తేగానీ, మనోడికి కదల బుధ్ధవ్వదా? మరి అమెరికాతో పోల్చితే కరోనా పరీక్షల శాతంలో ఇండియా ఎక్కడుంది? ఇదెందుకు మాట్లాడరు వారు? ఈ దిబ్బదేశంలో రోగమొచ్చీ, మందుల్లేకపోయినా, బ్రతికితే అది బ్రతికినవాడి ఘనతేగానీ... ప్రభుత్వం ఘనతెలా అవుతుందీ?

మళ్ళీ విషయానికే వద్దాం. అసలు యవారానికీ కంగనకీ సంబంధం ఏమిటి? ఈవిడ విషయంలోకి దూరడం వ్యవహారాన్ని దరిమళ్ళించడానికీ, తన రాజకీయ రహదారి వేసుకోడానికీ కాదా? వార్తవేశ్యగాడు సుశాంత్ మరణం గురించి ముప్పైరోజుల్లో 27 చర్చలు చేశాడట. వాడు ఇంతటి ఉన్మాదంతో చర్చించిన టాపిక్ ఇదిగాక ఇంకేదైన ఉందా? ఇదికేవలం ఆజ్‌తక్ నుంచి TRPల్లో మొదటిస్థానాన్ని లాగేసుకోడానికి చేసింది కాదా? ఆజ్‌తక్‌తో సహా మొత్తం హిందీ మీడియా శవరాజకీయం చేయట్లేదా? వీళ్ళు వీళ్ల TRPల కోసం మనలనూ ఇలా వేధిస్తే మనకెలా ఉంటుంది? ఇప్పుడు రియా నేరం చేస్తే, ఆసంగతి విచారించడానికి CBI ఉంది కూడా ED ఉంది. ఈ వెధవెవడండీ ఊరక్కుక్కల్లాంటి తన జర్నలిస్టులను పంపి ఆ పిల్లను వేధించడానికి? అసలు ఆపిల్ల వీడికెందుకు జావాబుదారీగా ఉండాలి? వీడి ఉన్మాదమ్ముదిరి ఆపిల్ల ఇంటికొచ్చే delivery boysని కూడా వేధిస్తున్నారే... ఒరేయ్! రాక్షసులారా మీకూ కుటుంబాలున్నయురా. ఒరేయ్ భారతీయ  λαμια-కొడకల్లారా! ఇలాంటి సన్నాసుల కార్యక్రమాలు చూడకండిరా! దేవుడిగుళ్ళో కళ్ళుమూసుకొని బూతుబొమ్మలూహించుకోవడం ఇంతకంటే మంచిపనిరా!

ఇహ బీజేపీ... y+ security అనేది సుప్రీంకోర్టు ఛీఫ్‌జస్టిస్ లాంటి చాలా కొద్ది మందికిచ్చేది. కంగనక్కాయ్‌కి ఏం బెదిరింపువచ్చిందివాయ్ y+ ఇవ్వడానికి? పద్మావతి సినిమా తరువాత... రాజపూత్‌సేన అనబడే ఒక రౌడీమూక... సినీ యూనిట్లోని వ్యక్తుల తలలకు వెలలుకడుతూ ఏకంగా సుపారీలిచ్చి, ఫత్వాలూ, ఫర్మానాలూ జారీచేసినప్పుడు... దీపికక్కాయ్ ఇంటిముందు ఇంటిముందు ఒక్క పోలీసునైనా నిలపలేదుకదరా! ఇదే సుశాంత్ నటించిన బద్రీనాధ్ చిత్రంలో love zihaad కోణముందని, నానా యాగీజేసి సినిమాను బహిష్కరించి, ఇప్పుడు ఏమొహలెట్టుకొని బీహార్లో సుశాంత్ మరణమ్మీద ఎన్నికలు పోరడతార్రా? 

సంజయ్ రౌత్ (ఉర్ఫ్ హరాంఖోర్). ఒరేయ్ హరాంఖోర్‌కు పుట్టిన హరాంఖోర్ (హరాంఖోర్ అనగా 'naughty' అనగా చిలిపి అని అర్ధము) వద్దని కోర్టు ఆదేశాలున్నా కొంపలు కూల్చడమేంట్రా మీ వెదవ గవుర్నమెంటు? అయినా ఎవుడ్నిబడితే వాణ్ణి "ముంబయ్ రావుద్దు" అనడానికి ముంబయేమన్నా ఠాక్రేగాడి బాబుగాడి జాగీరేమిట్రా?


హరాంఖోర్, naughty సమానార్ధకాలని తెలుసుకున్నాక naughty america వాళ్ళు తమ సైటు పేరు, లోగో ఇలా మార్చుకున్నారట.