Sunday, May 31, 2020

అయ్యో! అమెరికా!

ఎవడో ఒక నామకుణ్ణి ఒక చెడ్డపోలీసు చంపేస్తే, ఇహ నల్ల జనాలంతా పోలోమని వెళ్ళేసి షాపులు తగలెయ్యడమూ, లూటీలూ చెయ్యడమూ భావ్యమా? అదీ ఈ కరోనా సమయంలో!

అయిన వివక్ష ఎక్కడలేదు? ఏం ఆఫ్రికాలో లేదా? ఇండియాలోలేదా? చైనాలో లేదా? యోరప్‌లో లేదా? వాళ్ళందరూకూడా ఇలాగే తమదేశాలను తగలేసుకుంటున్నారా?

మనమంతా శంతియుతంగా విక్షకు వ్యతిరేకంగా పోరాడాలేతప్ప ఇలా రాయికిరాయే సమాధానమా?

అని ఆలోచించే ఉదార  స్వభావులూ, శాంతి కాముకులూ ఒక్కసరి ఈ రెండు వీడియోలూ చూడండే!

ఇలాంటి చైతన్యం అన్నిదేశాల్లోనూ రావాలి. ముఖ్యంగా ఇండియాలో!

Always #LikeAGirl

https://www.youtube.com/watch?v=XjJQBjWYDTs

అడపిల్లలాగ అదేంటలా? ఆడంగి వెధవ, చేతులుకి గాజులు తొడుక్కున్నామనుకున్నవా? అని అనే మగమహనుభావులకీ, ఆడమహానుభావిఉలకీ పై వీడియోనే సమాధానం.

Friday, May 29, 2020

అర్జునుడి రధం, కర్ణుడి దెబ్బలు

కురుక్షేత్రంలో కృష్ణుడు కర్ణుడు బాణం వేసిన ప్రతిసారి తెగమెచ్చుకుంటున్నాడట "ఎంత చఖ్హగా కొట్టావు బాణం" అంటూ. అర్జునుడేసే బాణాలకు కర్ణుడి రధం ఎగిరెగిరి పడుతున్నా అర్జుడికి ఎమీ ప్రశంసలు దక్కడం లేదట. అర్జునుడు నొచ్చుకుని అదే అడిగాడట. కౄష్ణుడు "ఒక్కసారి నన్ను రధం దిగనీ నాయనా తరువాత కర్ణుడి బాణాల ప్రతాపం చూద్దువుగానీ" అన్నాడట. ఆ తరువాతి క్షణంలో కర్ణుడు కొట్టిన బాణాలకి అర్జునుడి రధం గాల్లో ఎగిరిపోతానే ఉందట. కృష్ణుడు నవ్వుతూ "తగిలే ప్రతి దెబ్బనీ నేను ఆపుతున్నాను బాబూ అదంతా నీటాలెంటనుకోకు. దెబ్బ నాకు తెలుస్తోంది" అన్నాడట.


అలాగే యుధ్ధమంతా ముగిసాక "ఇక రధం దిగుదామా బావా" అని అర్జునుడంటే కృష్ణుడు "ముందు నువ్వు దిగునాయనా" అన్నాడట. కృష్ణుడు రధం దిగగానే అది పిండిపిండైపోయిందట. ఆస్చర్యపోతున్న అర్జునుడితో కృష్ణుడు "నీ రధాన్ని ఇన్న్నాళ్ళు రక్షించింది నేనే బాబు. నీమీదకి ఏ అస్త్రం వచ్చినా అది నన్ను దాటుకొని రావాలి. అప్పటికే అస్త్రం తనశక్తిని కోల్పొయి ఉంటుంది. ఇక నువ్వు చెయ్యల్సిందల్లా తిరిగి బాణాలు వేసుకోవడమే" అన్నాడట.

బర్బరీకుడు

మహాభారతంలో ఘటోత్కచుని కొడుకీతడు. మహాయొధుడు. కురుక్షేత్రం మొదలయ్యాక ఆ యుధ్ధంలో పాల్గొని తరించడానికి తరలివచ్చాడు. ఇతను ఎవరిపక్షం వహిస్తే ఆ పక్షం గెలిచితీరడం ఖాయం. అతనూ బలహీనపక్షం వైపుండి గెలిపించడానికొచ్చాడు. సమస్యల్లా ఏమిటంటే ఇతను ఏ పక్షం వహిస్తే అది అనింటికంటే బలమైనదైపోతుంది. కాబట్టి డైలమా. కృష్ణుడికి ఇదింకో సమస్యైకూచుంది.

యుధ్ధం మొదలయిపోయింది. అంత పెధ్ధ యుధ్ధం మొదలయ్యేటప్పుడు ఒక వీరుణ్ణి బలివ్వడం ఆచారమట. ఇంకేం మనవాడు ఖతం. కాకుంటే కృష్ణుడి వరంవల్ల కేవలం తలమాత్రం యుధ్ధాన్ని వీక్షించగలిగింది.

చివర్లో అడిగాడట కృష్ణుణ్ణి నన్నే ఎందుకు చంపారు? నన్ను యుధ్ధం చేయకుండా చేశారు అని. కృష్ణుడిలా అన్నాడట. "నువ్వు అనాగరికుడివి. మాలో ఒకడివి కావు. యుధ్ధంలో ఎవరు గెలిచినా నీకు ఒరిగిపడేది ఏమీ ఉండదు. మేము కనీసం పండక్కి ఎప్పుడూ ఇంటికి పిలిచి తాంబూలాలు కూడ ఇవ్వలేదు. నీదికాని యుధ్ధంలోకి నువ్వెందుకువాయ్ ఊపుకుంటూ వచ్చావ్? అడవుల్లో నీపని నువ్వు చూసుకొనుండొచ్చే!"