నిజాము నవాబుగారు ఏకంగా దేశం మధ్యలో ఉన్న హైదరాబాదును పాకిస్తాన్లో కల్పాలనుకున్నప్పుడు, అప్పటి రక్షణమంత్రి పటేల్గారికి మండుకొచ్చి, ఒక "పోలీసుచర్య" జరిపించారు. తత్ఫలితంగా నిజాముగారు "నన్నొగ్గెయ్ పటేలా" అంటూ దేశంవిడిచి పారిపోయారు. ఇది ఆ తరువాతి సంగతి. అంతా అయ్యాక ఈ "పోలీసుచర్య"కి ఐన ఖర్చులు ఎవరు భరించాలి అనే ప్రశ్న ఉత్పన్నమయ్యిందట. పోలీసు వాళ్లని భరించమంటే, వాళ్ళేమో జరిగింది "పోలీసు"చర్యైనా అందులో పాలొన్నది సైన్యంకాబట్టి, వాళ్లనే అడగండి అని సలహా ఇచ్చారట. తీరా సైన్యాన్ని అడిగితే, "పేరు వాళ్ళకీ, చమురొదిలేదిమాకా?" అని నిష్టూరమాడుతూ, జరిగింది "క్రమశిక్షణచర్య" కాబట్టి విద్యాశాఖవాళ్ళని అడిగిచూడండి అని ఒక ఉచిత సలహా పడేశారట.
అయ్యా! ఆవిధంగా "పోలీసుచర్య"కైన ఖర్చులు విద్యాశాఖ భరించింది.
P.S.: హైదరాబాదులో హిందువులెక్కువ, రాజుగారు పాకిస్థాన్లో కలపాలనుకున్నారు. భారతప్రభుత్యం "చెల్లదు ఫో" అంది. కరష్ట్!! కష్మీర్లో ముస్లిములెక్కువ, మరి రాజుగారు Letter of Accession ఇచ్చినప్పుడు ఎలా ఒప్పేసుకున్నారు? (by the way అది ఫోర్జరీ పత్రమట. ఈ ఘనకార్యాన్ని నిర్వర్తించింది పటేల్గారే నని చెబుతారు).