1915లో ఈటలీ మిత్రరాజ్యాలకు వ్యతిరేకంగా మొదటి ప్రపంచ యుధ్ధంలోకి దిగింది. ఇటలీ ఉద్దేశ్యమల్లా ఆస్ట్రో-హంగేరియన్ రాజ్యం "దురాక్రమించిన" Trento మరియు Trieste భూభాగాలను "విముక్తం" చెయ్యడమే. ఇటాలియన్ రాజకీయ నాయకులు యువతలో దేశభక్తినినింపే ఉపన్యాసాలిచ్చారు. పురాతన రోమన్ సామ్రాజ్య వైభవాన్ని పునర్నిర్మించే ఉద్దేశ్యంతో యువత "Trento, Trieste రాజ్యాలకోసం ప్రాణలర్పిస్తాం"అంటూ గెలుపనేది తమకు నల్లేరుమీద నడకేనన్న దృఢనమ్మకంతో యుద్ధానికి బయలుదేరింది.
ఫలితం మరోలా పరిణమించింది. Isonzo నది వద్ద వారితో తలపడ్డ అస్ట్రోహంగేరియన్ దళలు ఏర్పరుచుకున్న శక్తివంతమైన రక్షణవ్యవస్థలమీదకి మిడుతలదండులా దూకిన ఇటాలియన్ సైనికులు తీవ్రనష్టాలను చవిచూశారు. రెండేళ్లపాటు జరిగిన జరిగిన మూడు యుద్ధాలలో ఇటలీ వరుసగా పదిహేను, నలభై, అరవై వేల సైన్యాలను యుధ్ధభూమికి అర్పించుకొని వెనుదిరిగింది. ఇటలియన్ సైనికులు అప్పటికీ వెనుదిరగక మరిన్ని ఘోర యుద్ధాలు సాగించారు. వీళ్ళతో విసిగిపోయిన ఆస్ట్రోహంగేరియన్ రాజ్యం జరిగిన పదకొండో యుద్ధంలో రక్షణాత్మక వైఖరివీడి ఇటాలియన్ దళాలమీద దాడిచెయ్యడం మొదలుపెట్టింది. Caporreto వద్ద జరిగిన ఆ యుధ్ధంలో ఇటాలియన్ దళాలు వెనిస్ నగర పొలిమేరల్లోకి తరిమివేయబడ్డాయి. యుధ్ధం ముగిసాక చూసుకొంటే మొత్తం 7లక్షలమంది ఇటాలియన్ సైనికులు యుద్ధంలో మృతిచెందినట్లూ, పదిలక్షలమంది గాయపడినట్లూ తెలియవచ్చింది. చివరికి ఈ యుద్ధం బెనిటో ముస్సోలినీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది. "పోగొట్టుకున్న రాజ్యాలు తిరిగి కైవస పరుచుకోవాలంటే దానికి అది ఈ కుళ్ళిపోయిన వ్యవస్థవల్లకాదు. ముస్సోలినీ వంటి మొనగాడైతేనే సరి" అని ప్రజలే అదికారాన్ని ఫాసిస్టులకు అప్పజెప్పారు.
ఎందుకిలా జరిగింది అంటే కారణం ఇది: తమ తప్పును ఒప్పుకొని, లెంపలు వేసుకొని, ప్రక్కకు తప్పుకోలేకపోవడం. ఇటాలియనులు మొదటి యుద్ధం తరువాత లెంపలువేసుకొని, శాంతిసందేశం పంపించుంటే ఆస్ట్రియనులు ఎగిరిగంతేసి ఒప్పుకొనుండే వాళ్ళు. ఎందుకంటే ఆసమయాన ఆస్ట్రియా ఏకంగా రష్యాతో నిండుగా యుద్ధాల్లో మునిగుంది. ఇటలియన్ రాజకీయ నాయకులు లేనిపోని గొప్పలకు పోయి "మరణించిన సైనికుల కుటుంబసభ్యులకు ఏం సమాధానం చెబుతాం?", "మన సైనికుల ప్రాణత్యాగాలు వృధాపోనీం" అంటూ రొడ్డకొట్టుడు భావోద్వేగాలతో మరింతమంది సైనికులు మరణించడానికి కారణమయ్యారు.
ఇలాంటిదే ఇంకో సంఘటన. 1919లో స్కాంట్లండ్ ప్రభుత్వం ఒక పార్లమెంటు భవనాన్ని నిర్మించాలనుకుంది. ముందుగా అనుకున్నదాని ప్రకారం ఈ మొత్తం భవననిర్మాణ కార్యక్రమం రెండేళ్లకు పూర్తవుతుంది మరియు నలభై మిలియన్ల పౌండ్ల ఖర్చవుతుంది. నిజానికి ఆ భవనం నిర్మించడానికి ఐదేళ్ళు పట్టింది మరియు నాలుగు వందల మిలియన్ల ఖర్చయ్యింది!!! కారణం? మళ్ళీ అదే! కాంట్రాక్టర్లు ఏదో ఒక సమస్యతో, మరింత డబ్బును మంజూరు చెయ్యమని ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పుడల్లా ప్రభుత్వం ఇలా ఆలోచించింది "ఇప్పుడు మనం భవన నిర్మాణం ఆపేస్తే, ఇప్పటిదాకా పెట్టిన ఖర్చంతా వృధా అయిపోతుంది. ప్రజలకు ఏమని సమాధానం చెప్పుకుంటాం?". ఇది సరిగ్గా ఇటాలియనుల "మన సైనికుల ప్రాణాలు వృధా కాబోవు"కి మారురూపు. ఇప్పుడు వెనుదిరిగితే ఇప్పటిదాకా చేస్తూ వస్తున్నదని పొరబాటని ఒప్పుకోవాలి. అందుకెవరూ సిధ్ధంగా లేకపోవడమే ఈ భారీ నష్టాలకు కారణం.
ఈ ధోరణి కేవలం రాజకీయ, ఆర్ధిక రంగాల్లోనే కాదు. మతంలోకూడా చూడవద్దు. ఏనాడైతే గెలీలియో చెప్పినది ఋజువయ్యిందో, ఆనాడే బైబిల్లో ఉన్నది సత్యదూరమన్నది ఋజువైపోయింది. కానీ అలాగని ఒప్పుకొని లెంపలేసుకోవడమంటే, ఇప్పటిదాకా, తను, తన తల్లిదండ్రులూ, తన పూర్వీకులూ అనుసరిస్తూ వస్తుందంతా, చేస్తూ వస్తున్నదంతా పనికిమాలినది అని ఒప్పుకోవాలి. ఆ నిజాయితీ మనక్కుదరదు. కాబట్టి తప్పుడు దారిలోనే ముందుకెళ్ళి మరింత కూరుకుపోతాం! దీనినే sunk-cost fallacy అంటారు.
1986, 28 జనవరి. నాసావారు Challenger space shuttleని Cape Canaveralనుండి ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పటికే ఆ ప్రయోగం పలుమార్లు వాయిదా పడింది. challengerలో అంతరిక్షంలోకి వెళ్లేవాళ్లలో ఒక స్కూల్ టీచరుకూడా ఉండడంతో ప్రజలందరూ ఆ ప్రయోగంకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ప్రయోగం జరిగే ముందురోజు రాత్రి నాసావాళ్ళు, వారి రాకెట్ మోటర్లు తయారుచేసిన కాంట్రాక్టరు Morton Thiokol సంస్థ ప్రతినిధులతో ప్రయోగం విషయంలో ముందుకెళ్ళడమా వద్దా అని చర్చలు జరిపారు. Morton Thiokolలో సీనియర్ అయిన Allan McDonald అనే ఆయన "అబ్బాయిలూ... రాకెట్ మోటర్లకు రక్షణగా వాడుతున్న రబ్బరు O-rings ని మనం ఇప్పటిదాకా 53 డిగ్రీల ఫారణైట్ వద్ద పరీక్షించాము. ఈనాటి ఉష్ణోగ్రత 18 డిగ్రీల ఫారణైటున్నది. అంత తక్కువ ఉష్ణొగ్రతావద్ద అవి పనిచేస్తాయని నాకు నమ్మకంలేదు. మీరు మీ ప్రయోగాన్ని మరోసారి వాయిదా వేసుకోండి" అని చెప్పాడు. నాసా వాళ్ళు "మీకు నమ్మకం ఉండడమూ లేకపోవడమూకాదు. అవి పనిచెయ్యవని మీరనుకుంటే అవి ఎందుకు పనిచెయ్యవో శాస్త్రీయంగా ఋజువుచెయ్యండి. లేకుంటే నోర్ముసుకొని ప్రయోగానికి అంగీకారం తెలపండి" అని సమాధానం పంపించారట. ఋజువుచెయ్యలేని Mortonవాళ్ళు "సరే ఛావండి" అని రిప్లై పంపించారట. చివరికి ఆ ప్రయోగం విఫలమయ్యి, అందులో ప్రయాణిస్తున్నవారందరూ మరణించారు. తరువాత జరిగిన పరిశోధనలో ప్రయోగ వైఫల్యానికి కారణం ఇలా తెలియవచ్చిందట: తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా O-rings పనిచెయ్యకపోవడం.
Think Like a Freak రచయితలు ఈ విషయంలో ఒక ప్రయోగం చేశారు. వాళ్ళు తమ బ్లాగు పాఠకులనుంచి కొన్ని ప్రశ్నలను ఆహ్వానించి. వాటికి randomగా "అవును", "కాదు" అని సమాధానాలిచ్చారట (ఒక software dice సహాయంతో). వాళ్లకు వచ్చిన ప్రశ్నలు క్రింది విధంగా ఉన్నాయ్:
నేను ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలా?
నేను స్కూలుకి తిరిగివెళ్ళాలా?
నేను నా boy friend/girl friend కి రాంరాం చెప్పలా?
నేను బైపాస్ చేయించుకోవాలా లేక ఆంజియోప్లాస్టీ చేయించుకోవాలా?
నేను క్రైస్తవం పుచ్చుకోవాలా?
నేను సైన్యంనుండి బయటపడాలా?
చివరికి తేలిన విషయం క్లుప్తంగా ఏమిటంటే క్విట్టకపోవడంవల్ల ఊడిపడిన మహోపయోగం ఏమీలేదట. ఇలాంటి life and death questions విషయంలో మనం బొమ్మాబొరుసూ వేసి నిర్ణయాలు తీసుకున్నా ప్రపంచం ఏమీ బ్రద్దలవదట :-)

