మనిషిని అత్యంతకాలంపాటు విసిగించిన ఒకే ఒక్క సమస్య మరణం. పురాతన సంస్కృతులు మరణం జీవితంలో ఒక అవిభాజ్యమైన భాగమని, అసలు మరణం లేకుంటే జీవితానికి అర్ధంలేదని భావించాయి. మనషుల జీవితాల సంగతేమోకానీ, "ఈ స్వర్గ నరకాల కబుర్లన్నీ నమ్మం" మనుషులు నిర్ణయించేసుకుంటే మతాలన్నీ వాట అర్ధాన్నీ, మతాధికారులందరూ వారి అధికారాల్నీ కోల్పోతారు. అందుకే ఒకప్పుడు గొప్పగొప్ప తాత్వికవేత్తలు, మేధావులూ మరణమ్యొక్క అవశ్యకతను నొక్కిచెప్పేపనిలో మునిగితేలారు. సాహిత్యంలో 20వ దశకంలో ఈ తీరులో మార్పు కనిపించింది. ఉదారవాదులూ, సామ్యవాదులూ, స్త్రీవాదులూ ఇతరత్రావాదులూ స్వర్గనరకాల్ని పూర్తిగా విస్మరించేశారు. కావాలంటే ఒక కమ్యూనిస్టో, ఫెమినిష్టో చనిపోయాక ఏమౌతాడోనని వాళ్లవాళ్ల సాహిత్యాల్లో వెతికి కనుక్కొనే ప్రయత్నం చెయ్యండి చూద్దాం! ఇప్పటికీ మరణానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చేది జాతీయవాదులుమాత్రమే! దేశంకోసం చస్తే ఏదో ఒరిగిపడుతుందని వీరు నమ్మబలుకుతారు. అవసర సమయంలో దేశంకోసం మరణిస్తే, ప్రజల ఉమ్మడి మనసుల్లో కలకాలం జీవిస్తారని వీరు చెప్పేకబుర్లను ఎలా అర్ధంచేసుకోవాలో చాలామందికి అర్ధంకాదు.
సైన్సుదగ్గరికొస్తే, మరణం అనేది కేవలం ఒక టెక్నికల్ సమస్య. ఉదాహరణకి King Richard - The Lionheart గారి ఉదాహరణే తీసుకోండి. 1109 వ సంవత్సరంలో King Richard గారి ఎడమభుజంలోకి ఒక బల్లెం దూసుకుపోయింది. ఇలాంటి సంఘటనే నేడు జరిగితే, మన పేపర్లవారు King Richard గారు "స్వల్పగాయాలకు" గురయ్యారు అని రాసుండేవారు. కానీ ఆ సంఘటన జరిగింది 1109లో. అప్పట్లో దానికి ఉన్న ఒకేఒకమందు గాయమైన భాగం కుళ్ళిపోయి, అది మిగతా శరీరభాగాలకు పాకేలోపల నరికెయ్యడమే. భుజాన్ని నరకలేంకదాని, ఏంచెయ్యాలో తోచక ఆగాయాన్ని ఆలా వదిలేశారు. ఫలితంగా Lionheart గారు రెండువారాలు నరకయాతన అనుభవించి మరణించారు. ఆయనకనేకాదు. ఒకప్పుడు యూరప్లో చిన్నగాయాలైనా కూడా ఎందుకైనా మంచిదిలే అని మొత్తం చేతినో, కాలునో నరికేసేవారు. దీనిగ్గానూ సైన్యంలో వడ్రంగుల, లోహకారుల సేవలు వాడుకొనేవాళ్ళు. అదికూడా ఎలాంటి మత్తుమందువాడకుండా ఈ శశ్త్రచికిత్సలుచేసేవారు. ప్రస్తుతంచూస్తే మన డాక్టర్లు Nanobots ద్వారా శరీరంలో కృత్రిమ రోగనిరోధకను పెంచడంగురించీ, కాన్సరును పోరాడడం గురించీ ఆలోచిస్తున్నారు.
అసలా మాటకొస్తే కాన్సరుది ఒక ప్రత్యేకమైన కధ. కాన్సర్ అనేది శరీరంలో పోగుపడిపోయిన genetic errors కారణంగా వస్తుంది. ఇలా genetic errors పోగుపడాలంటే, ముందా వ్యక్తి దీర్ఘకాలం జీవించి ఉండాలి. శిశుమరణాల రేటు ఎక్కువగా ఉండే ఒకప్పటికాలంలో మనిషి ఐదారేళ్ళు జీవించడం గగనం. అది దాటి బ్రతికినవారు మహా ఉంటే ఒక ముప్పైయేళ్ళు జీవించేవారు. ఇంక అదికూడా దాటి బ్రతికినవారు దాన్ని షష్టిపూర్తి లాంటి అరుదైన వేడుకలు చేసుకొనేందుకు జీవించి ఉండేవారు. అందుకే ఆరోజుల్లో "ఆరేడుమందిని కనిపారేస్తే, అందులో కొందరైనా చేతికందివస్తారుకదా!" అని ఆలోచించేవాళ్ళు. ఇందుకూ... ఆరోజుల్లో కాన్సరు వ్యాధి గురించి ఇంత తరచుగా ప్రచారం లభించంది! అందుకూ.. ఆవ్యాధిని ధనవంతుల రోగమనీ, రాచపుండు అని వ్యవహరించింది! అసలా మాటకొస్తే చరిత్రలో రికార్డైన మొదటి కాన్సరు పేషంటు మొదటి డేరియస్ గారి రెండవ భార్య, క్రీ. పూ. 550లో జన్మించిన అటొస్సా గారట. ఒకప్పుడ్ శిశుమరణాల రేటు ఎలాఉండేదో అర్ధమవ్వాలంటే మొదటి ఎడ్వర్డు రాజుగారి వ్యవహారాన్ని ఒకసారి పరిశీలించాలి. 1237-1307 సంవత్సరాల మధ్య ఇంగ్లండును పాలించిన రాజుగారు మొదటి ఎడ్వర్డు. దేశంలోనే అత్యంత అధునాతమైన వైధ్యవిధానాలు ఆయనకి అందుబాటులో ఉండేవి. అయినప్పటికే ఆయనకు పుట్టిన పదహారు మంది సంతానంలో అందరూ చనిపోయి ఒక్కగానొక్క కొడుకు రెండా ఏడ్వర్డుగారు మాత్రం పాలనాధికారాలు పొందడానికి మిగిలున్నారట. పుట్టిన పదహారు మందిలో యవ్వనంలోకి అడుగుపెట్టింది 6గురు అంటా -అంటే 65 శాతం. నలభయ్యిల్లోకి జీవించి ఉండింది కేవలం ముగ్గురంట -అంటే 18 శాతం. ఇది రాజుల, రాజకుమారుల పరిస్థితి. ఇక సామాన్యులగురించి మనం సులభంగానే ఆలోచించవచ్చు. ఒక దిక్కుమాలిన ప్లేగు వస్తే యూరప్లో 2/3వ వంతు జనాలు హరీమన్నారు. ఒకప్పుడు ఇలాంటివి వస్తే దేవుణ్ణీ ప్రార్ధించడం తప్ప వేరే గత్యంతరం ఉండేదికాదు. మొన్నటికి మొన్న ఆఫ్రికాలో ఎబోలా వస్తే, ఆయా ప్రభుత్వాల, సంస్థల అలసత్వం అనుకున్నామేతప్ప, దేవుడిమీద భారం వేసి, నెత్తినచేతులు వేసుక్కూచోలేదు.
గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అన్నది వట్టి పనికిమాలిన మాట. ఒకప్పుడు మనుషులు ఎందుకు చచ్చేవారోకూడా తెలిసేది కాదు. లోబోపీతో చనిపోయినా "సునాయాస మరణం" అనీ, "మంచి చావు" అనీ, "మందూమాకూ లేని రోగమని" చెప్పుకొని జనాలు చెవులు కొరుక్కొనేవారు. ఇప్పుడు కనీసం మనకు పేర్లైనా తెలుస్తున్నాయ్. చాలా వాటిని నివారించగలుగుతున్నాం. 2050 నాటికి మీరు జీవించి ఉండి, చేతిలో నిండుగా డబ్బుంటే మీరు మీ మరణాన్ని ఒక పదేళ్లపాటు వాయుదా వేసుకోవచ్చు. ఆపదేళ్ల తరువాత వచ్చే టెక్నాలజీతో ఇంకోపదేళ్ళు వాయిదా వేసుకోవచ్చు. ఏమో ఎవరికి తెలుసు! ఒకప్పుడు ధనవంతుకు మాత్రమే అందుబాటులో ఉన్న కాగితం, కంప్యూటరుల్లాగనే ఈ మరణాన్ని వాయిదావేసుకొనే టెక్నాలజీకూడా రాన్రాను బాగా చవకయిపోయి సామాన్య జనాలక్కూడా అందుబాటులోకి రావచ్చు. అప్పుడుకూడా ఈ చర్చివాళ్ళు, గడ్డాలవాళూ, పిలకలవాళ్ళు చెప్పేమాటలనెవరైనా వినేవాళ్ళుంటారా? ఆవిధంగా పదిహేను వందలయేళ్ళుగా (అతి కుర్రమతమైన ఇస్లాం దాదాపు పదిహేనువందలయేళ్లక్రితం పుట్టింది) మతాలు మరణానంతరం జీవించబోయే రెండవజీవితం గురించి సొల్లుకబుర్లు చెప్పి మనిషుల్ని వెధవల్ని చేస్తుండగా, సైన్సు కేవలం నాలుగొందల ఎలాంటి వాగడంబరం, చడీచప్పుడూ లేకుండా యేళ్లలో మనుషుల సరాసరి జీవన ప్రమాణాన్ని రెట్టింపు (కొండుకచో కొన్నిదేశాల్లో మూడింతలు) చేసింది. "అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను" పద్యం మన ప్రవక్తలకూ, దేవుళ్ళకూ, దేవునికుమారులకూ సరిగ్గా సరిపోతుంది.
